
బీఎన్ రోడ్డుపై ఇచ్చిన హామీ అమలు చేయాలి
చోడవరం నియోజకవర్గంలోని బీఎన్ రోడ్డుపై ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు డిమాండ్ చేశారు. గర్నికం నుంచి మేడివాడ వరకు రోడ్డు దుమ్ము, ధూళితో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దొండపూడి వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన రోడ్డు కూడా ఇప్పటికీ పూర్తికాలేదని ఆయన విమర్శించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.



































