చోడవరం; ప్రారంభమైన గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

8చూసినవారు
చోడవరం; ప్రారంభమైన గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు
చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్ధి బుద్ధి సమేత శ్రీ సంతాన గణపతి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఆలయంలో హోమాధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2022లో పది లక్షల రూపాయలు మంజూరవగా, గ్రామ ప్రజల సహకారంతో దేవాలయం నిర్మాణం పూర్తి చేసి, ప్రతిష్టతో పాటు శిఖరావిష్కరణ కార్యక్రమాలు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్