కూటమి ప్రభుత్వం కావాలనే ఎన్టీఆర్ చిత్రం మీద ఆంక్షలు పెడుతోందని, ద్వారకానగర్, మర్రిపాలెంలో ఎన్టీఆర్ అభిమానులు గురువారం అర్ధరాత్రి వరకు ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. అభిమానులు భారీగా చేరుకోవడంతో ద్వారకా నగర్ వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ మేరకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అనంతరం అభిమానులు శాంతించారు.