ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘
ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం (జూన్ 02) ఉదయం విశాఖపట్నంలోని జ్ఞానాపురం ప్రాంతంలో పింఛన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న కలెక్టర్, లబ్ధిదారులకు పింఛను డబ్బులతో పాటు వేసవి ప్రత్యేక కానుకగా మామిడి పండ్లను అందజేశారు. మార్కెట్లో అధిక ధరల కారణంగా మామిడి పండ్లను కొనుక్కోలేని నిరుపేదలు, వృద్ధుల పరిస్థితిని గమనించి ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఊహించని ఈ బహుమతితో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.