విశాఖ: మోదీని సత్కరించిన చంద్రబాబు, పవన్ (వీడియో)
By R. Kiran Kumar 60చూసినవారుఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్న నేపథ్యంలో ఏపీ తరుఫున ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్కరించారు. ప్రధానికి శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీ బహూకరించారు. ఈ సందర్భంగా ఎన్డీఏతో తమ మైత్రిని మరోసారి చాటిచెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం మరువలేదని చంద్రబాబు పేర్కొన్నారు.