కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హోంమంత్రి వంగలపూడి అనిత వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్ల పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలను అప్పటి ప్రభుత్వం విస్మరించిందని, వారికి న్యాయం చేయలేదని ఆమె విమర్శించారు. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నా, కార్మికులు రోడ్లపై పోరాడుతున్నా అప్పటి పాలకులు పట్టించుకోలేదని, బాధితుల కుటుంబాలకు కనీస భరోసా ఇవ్వలేదని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు.