భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన రహదారుల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, గడువులోగా పూర్తి చేయాలని విశాఖ వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, మాస్టర్ ప్లాన్కు సంబంధించిన 7 ప్రధాన రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.