విశాఖ: రుచుల పండుగకు వేళాయె

1712చూసినవారు
వైజాగ్ వాసులకు ఆహార ప్రియుల కోసం పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బీచ్ రోడ్‌లోని ఎంజీఎం మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలో 40కి పైగా స్టాల్స్‌లో ఆంధ్రా సంప్రదాయ వంటకాల నుంచి అంతర్జాతీయ మెనూల వరకు, గోదావరి రుచుల నుంచి ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేక వంటకాల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ తినుబండారాల వేడుక సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది.