గాజువాక సమీపంలోని అగనంపూడిలోని అభిరామ్ బ్లూ ఎవెన్ అపార్ట్మెంట్స్లో 13 కేవీ సామర్థ్యం గల సౌర విద్యుత్ రూఫ్టాప్ పైలెట్ ప్రాజెక్టును కశింకోట సర్కిల్ ఈఈ ఎస్. రామకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్లపై రాయితీతో సౌర రూఫ్టాప్లను నిర్మించుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.