గాజువాక సమీపంలోని హరిజన జగ్గయ్యపాలెం రైల్వే ట్రాక్పై ఆదివారం గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుని తల, మొండెం చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, ఇది ఆత్మహత్యగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.