కేంద్ర ప్రభుత్వ 'పీఎం ఈ బస్సు సేవ' పథకం కింద మంజూరు చేసిన వంద ఎలక్ట్రిక్ బస్సుల్లో భాగంగా, తొలి విడతగా 9 అధునాతన ఈ-బస్సులను గాజువాక ఆర్టీసీ డిపోలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి గాజువాక ఎమ్మెల్యే,
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, గాజువాక ప్రజలకు సురక్షితమైన, అత్యాధునిక రవాణా సౌకర్యాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.