మంగళవారం, మాడుగుల పంచాయతీ పరిధిలోని ఎం గతబూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వి. రామధర్మజ, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉపసర్పంచ్ జే వరహాలు, పార్టీ నాయకులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఎస్ సత్తిబాబు, కే శ్రీధర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.