విద్యుత్ షాక్ కి గురై డి. గొట్టివాడకు చెందిన బొంబాయి శివాజీ (22) మృతి చెందినట్టు స్తానిక ఎస్సై నారాయణ రావు గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం శివాజి గురువారం తన పొలoలోని విద్యుత్ మోటార్ కి కరెంట్ రావడం లేదని, విద్యుత్ తీగలకు ఉన్న కొమ్మలను ఐరన్ గొట్టం తో తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ గొట్టానికి విద్యుత్ సరఫరా అయి యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.