
6న విశాఖకు గవర్నర్
రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ఈ నెల 6, 7 తేదీలలో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 6వ తేదీ ఉదయం 8 గంటలకు విమానంలో నగరానికి చేరుకుని నోవాటెల్కు వెళ్తారు. మధ్యాహ్నం 12. 45 గంటలకు నోవాటెల్ నుండి మధురవాడలోని క్రికెట్ స్టేడియంకు బయలుదేరతారు. 7వ తేదీ మధ్యాహ్నం 1. 45 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకుని విజయవాడకు పయనమవుతారు.







































