మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుంకర పద్మశ్రీ నేతృత్వంలో విశాఖపట్నంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కాలంటే ఈ బిల్లును కాలయాపన చేయకుండా తక్షణమే పట్టాలెక్కించాలని వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.