జి. మాడుగుల, గూడెంకొత్తవీధి మండలాల్లో ఈనెల 10న విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. వేణుగోపాల్ తెలిపారు. పాడేరు నుంచి జి. మాడుగులకు సరఫరా చేస్తున్న 33 కేవీ లైన్కు మరమ్మతులు చేపట్టనున్నందున సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.