మంప ఎస్సై శ్రీనివాస్ సోమవారం కొయ్యూరు మండలం బూదరాళ్ల గ్రామంలో పర్యటించి, రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గ్రామస్తులు, వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. బైక్పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.