విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఓ బాలింత, ఆమె కుటుంబ సభ్యులు గురువారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. గోపాలపట్నంకు చెందిన ఉమాదేవి గత సోమవారం కేజీహెచ్లో చేరగా, ప్రసవం సమయంలో శిశువు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబం ధర్నాకు దిగింది.