విశాఖపట్నం కేజీహెచ్లోని పోషకాహార పునరుద్ధరణ కేంద్రంలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చేరిన పిల్లలందరికీ బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారులు ఈ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. అలాగే, ఎన్ఆర్సీ వార్డులలో రెండు కొత్త 2-టన్నుల ఎయిర్ కండిషనర్లను ప్రారంభించారు.