మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీలో కొత్త చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మంగళవారం 36వ వార్డ్ వైసీపీ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ షకిల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ముస్లింలు వైఎస్సార్సీపీలో చేరారు. వాసుపల్లి గణేష్ కుమార్ వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.