ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విశాఖను భవిష్యత్ నగరంగా, బెస్ట్ టూరిజం డెస్టినేషన్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. విశాఖలో వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో జరిగిన సమావేశంలో, రాష్ట్రంలో నౌకాదళ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.