విశాఖ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జీవీఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ బి. రాము అన్నారు. శుక్రవారం వార్డు నెం. 49లో బహిరంగ మూత్ర విసర్జన నివారణ, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా మరుగుదొడ్లు వినియోగించాలని, డ్రైనేజీల్లో ప్లాస్టిక్, చెత్త వేయకూడదని సూచించారు. పరిశుభ్రమైన డ్రైనేజీలతోనే దోమలు, దుర్వాసనలు, నీటి నిల్వల సమస్యలను నివారించవచ్చని తెలిపారు.