విశాఖలో జరిగే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పందిరి రాట మహోత్సవానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ను దేవస్థానం ఆహ్వానించింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నవంబర్ 1వ తేదీన ఈ మహోత్సవం జరగనుంది. దేవస్థానం ఈవో శోభారాణి, ఏఈవో రాజేంద్ర, వేదపండితులు లక్ష్మీనారాయణ, ప్రధాన అర్చకులు శ్రీనివాస్లు గురువారం కలెక్టర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.