విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో శనివారం దిశ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు హాజరై ప్రగతి నివేదికలను సమర్పించారు.