విశాఖపట్నం నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన ఒక మహిళ, సెక్యూరిటీ చెక్ తర్వాత తన బ్యాగ్ను విమానాశ్రయంలోనే మర్చిపోయింది. బెంగళూరు చేరుకున్నాక విషయం తెలుసుకుని కంగారుపడిన ఆమె, తన సోదరుడికి సమాచారం అందించింది. విశాఖపట్నం పోలీసులు వెంటనే స్పందించి, విమానాశ్రయ అధికారుల సహకారంతో బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ను సకాలంలో అందించిన పోలీసులకు ప్రయాణికురాలు కృతజ్ఞతలు తెలిపారు.