సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల కోసం డిసెంబర్ 14 ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. 2026 జనవరిలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.