విశాఖ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు 15 నుంచి శ్రీకారం

7చూసినవారు
విశాఖ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు 15 నుంచి శ్రీకారం
జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ ఆదేశాల మేరకు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 15 నుండి జూలై 14 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేపట్టి, ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి తిరిగి సేకరిస్తారు. ఓటర్లు పూర్తి వివరాలతో ఫారాలను నింపి బీఎల్‌వోలకు అందజేయాలి. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుంది. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ 1950 లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్