రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఏపీ 36వ స్థానంలో నిలిచిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా గాడి తప్పాయో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, డమ్మీ హోం మంత్రి అనిత, సీఎం చంద్రబాబు చేతకాని పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.