విశాఖపట్నం, మహారాణిపేట పోలీసులు ఆదివారం గంజాయి స్మగ్లింగ్ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో గతంలో అనేక నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారు. ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పృథ్వీరాజ్, గొమంగి నాని బాబు, లోచలి కుమార స్వామిలు కలిసి గంజాయి సరఫరా చేస్తున్నట్లు సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.