విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ) పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం 'హై రిస్క్ న్యూబోర్న్ న్యూరోడెవలప్మెంటల్ ఫాలో-అప్' అనే అంశంపై ప్రత్యేక వర్క్షాప్ జరిగింది. దేశవ్యాప్తంగా 50 మందికి పైగా వైద్య నిపుణులు హాజరైన ఈ కార్యక్రమంలో, నవజాత శిశువులలో మెదడు ఎదుగుదల లోపాలను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా భవిష్యత్తులో తీవ్రమైన వైకల్యాలను నివారించే మార్గాలపై చర్చించారు.