జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ సంఘటనకు కారణమని కేకే రాజు, వరుదు కల్యాణి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.