
విశాఖ: అవినీతికి పాల్పడిన కేజీహెచ్ ఉద్యోగి తొలగింపు
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో రోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ శానిటేషన్ వర్కర్ సిరిపురాపు మధును విధుల్లోంచి తొలగించారు. శనివారం విశాఖ కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ కేజీహెచ్లోని బర్న్స్ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేయగా, సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, మధు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించి, అతడిని వెంటనే తొలగిస్తున్నట్లు ఏజెన్సీ జోనల్ ఇన్చార్జ్ ఎం. రామసుబ్బారావు ప్రకటించారు.





































