న్యూఇయర్ వేళ విశాఖపట్నంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ నగర్కి చెందిన షణ్ముఖరావు (33) ఇటీవల స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు జరిగిన గొడవలో తన స్నేహితుడు జానీని కొట్టాడు. దీనిపై జానీ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడిన షణ్ముఖరావు గురువారం మామిడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గోపాలపట్నం పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.