ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యల కోసం విశాఖలో వైసీపీ ఫిర్యాదు

2చూసినవారు
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యల కోసం విశాఖలో వైసీపీ ఫిర్యాదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతలను కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం నగర నేతలు పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఏప్రిల్ 9న ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు మాట్లాడుతూ, మహిళలను అవమానించేలా రాతలు రాసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్