మునగపాక సమీపంలో అవ కాలువకు గండి పడడంతో వరద నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. దీనివల్ల మునగపాక నుంచి వాడ్రాపల్లి, మూలపేట, మంగళవారపు పేట, పాటిపల్లి వంటి గ్రామాలకు రాకపోకలు సాగించేవారికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై నీరు ప్రవహించడం వల్ల గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.