Jan 02, 2026, 12:01 IST/గోషామహల్
గోషామహల్
రేపు అసెంబ్లీ ముట్టడించనున్న ఆటో కార్మికుల జేఏసీ
Jan 02, 2026, 12:01 IST
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం చలో అసెంబ్లీకి ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. శుక్రవారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రెండేళ్లు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచడం, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.