భోజనం చేసిన 10-15 నిమిషాల తర్వాత నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మితమైన వేగంతో 10-20 నిమిషాలు నడవడం వల్ల శరీరం గ్లూకోజ్ను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. సౌకర్యవంతమైన చెప్పులు ధరించి నడవాలని, బ్యాలెన్స్డ్ ఆహారం, తగిన నిద్రతో పాటు ఈ అలవాటును కొనసాగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.