ఏపీ జెన్కో పరిధిలో కారుణ్య నియామకాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 నెలలకోసారి కారుణ్య నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఈ మేరకు 27 మంది దరఖాస్తుదారులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వం భరోసా అందిస్తుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.