AP: రైతులకు శుభవార్త. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రైతులకు యూరియా ఎంత కావాలంటే అంత అందుబాటులో ఉందని, డోర్ డెలివరీకి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈసారి లక్ష మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువ సప్లై చేశామన్నారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు, ఎందుకంటే ఎక్కువ వాడితే భూమి నిస్సారమవుతుందని హెచ్చరించారు. అలాగే ఈ-క్రాప్ నమోదు గడువును పెంచామని, రైతులందరూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.