రాజస్థాన్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ప్రధాని
మోదీ అన్నారు. శనివారం రాజస్థాన్లో పర్యటించి మాట్లాడారు. 'జోధ్పూర్లో ఈరోజే కొత్త విమానాశ్రయం ప్రారంభించాం. గ్యాస్ సమస్యను ఏడు రోజుల్లో పరిష్కరించాం. ప్రజలు ఇబ్బందులు పడవద్దన్నదే మా ప్రభుత్వం ఉద్దేశం. ఉక్రెయిన్ యుద్ధంతో యూరియా బ్యాగ్ రూ.3వేలకు పెరిగింది. అయినప్పటికీ దేశంలో రైతుల కోసం రూ.300కే ఇస్తున్నాం. దేశంలో యూరియా ఉత్పత్తి పెంచాం' అని అన్నారు.