AP: కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అమరావతి పేరుతో ప్రజలపై రూ.2 లక్షల కోట్ల భారం మోపే బదులు, అందులో 10% ఖర్చు చేస్తే మావిగన్లో అద్భుత సౌకర్యాలు కల్పించవచ్చని ఆయన అన్నారు. ప్లాన్-ఏ కింద వైజాగ్ను రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా చెప్పామన్నారు. ప్లాన్-బీ కింద మావిగన్ను సూచించామని, అమరావతిలో కట్టే బిల్డింగులను అక్కడ కట్టాలని చెప్పామని జగన్ తెలిపారు.