కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీ, ఏఐని దేశం వేగంగా అందిపుచ్చుకుంటోందని, దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారని తెలిపారు. పౌరుల జీవనశైలిని మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-చెన్నై కారిడార్లు ఎంతో ప్రయోజనకరమని, అరుదైన ఖనిజాల వెలికితీతతో ఏపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.