AP: సాంకేతికత జోడించి పాలనలో పారదర్శకత తీసుకొస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అక్కయ్యవలసలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం కోటబొమ్మాళిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గత పాలనలో రీసర్వే పేరుతో రికార్డులను తప్పుడుతడకలుగా మార్చారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.