TG: ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ పార్కుల ద్వారా వేలాదిమందికి
ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. శనివారం కర్నూల్లో మంత్రి భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 19 కంపెనీల్లో 1460 ఉద్యోగాలకు జాబ్మేళా నిర్వహించామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్మేళా నిర్వహిస్తామని మంత్రి వివరించారు. 20 లక్షల
ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.