AP: బాపట్ల జిల్లాలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్క రూపాయి అవినీతి లేకుండా పట్టాదారు పాస్బుక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 127 కోట్ల పాస్బుక్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూ హక్కుల విషయంలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.