AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఆయన స్పందిస్తూ, కచ్చితంగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అందుకే ఈ విషయంపై మంత్రి నారా
లోకేశ్ సమాధానం చెప్పలేదని, ఐఏఎస్ అధికారితో అబద్ధాలు చెప్పించారని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ను ఉద్దేశించి విమర్శలు చేశారు.