AP: గంజాయి స్మగ్లింగ్ చేసేవారిని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కాల్చి పడేస్తానని హెచ్చరించారు. గంజాయి పెడ్లర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. కాకినాడ జిల్లాలో గంజాయిపై సమాచారం అందితే తమ నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పారు. ఇకపై ఇంకా దూకుడుగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.