పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆమె రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను పుట్టింది, పెరిగింది భవానీపుర్లోనే. నా జీవితంలో అంతా ఇక్కడి నుంచే మొదలైంది' అని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించడంపై మమత ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.