ఆచంట - Achanta

వృద్ధాశ్రమంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన మానవత సంస్థ

వృద్ధాశ్రమంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన మానవత సంస్థ

మానవత సంస్థ, భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన వర్మ మాతృమూర్తి పెన్మెత్స వెంకాయమ్మ వర్ధంతి సందర్భంగా, తాడేరు రోడ్డులోని వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు మంగళవారం పండ్లు, స్వీట్లు, భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, వేగేశ్న రామచంద్రరాజు, కమలాదేవి, సాగి అన్నపూర్ణ, పెన్మెత్స సూర్యనారాయణరాజు, వల్లి కుమారి, పెన్మెత్స సత్యనారాయణ రాజు, విజయరామరాజు, గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, కనుమూరి పెద్దిరాజులు పాల్గొన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
మంచిర్యాల: పెళ్లికి రూ.10,116.. సర్పంచ్ అభ్యర్థి తరఫున ఫ్రెండ్స్ హామీ
Dec 17, 2025, 02:12 IST/మంచిర్యాల
మంచిర్యాల

మంచిర్యాల: పెళ్లికి రూ.10,116.. సర్పంచ్ అభ్యర్థి తరఫున ఫ్రెండ్స్ హామీ

Dec 17, 2025, 02:12 IST
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పంచాయతీలో సర్పంచి అభ్యర్థి అసంపల్లి రాజయ్య తరపున ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆకట్టుకునే హామీలు ఇచ్చారు. రాజయ్య గెలిస్తే, పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ.10,116, ప్రసూతి ఖర్చులకు రూ.5,116, వస్త్రాలంకరణకు రూ.5,116, అత్యవసర వైద్యానికి రూ.5-10 వేలు, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,116 చొప్పున తాము అందిస్తామని గుడి భాస్కర్‌రెడ్డి, గుడి దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రకటించారు. అభ్యర్థి స్నేహితులు ఇలా ముందుకు రావడం ఆకట్టుకుంటోంది.