భీమవరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా బుధవారం ఉదయం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పాల్గొన్నారు. ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.